హైదరాబాద్ : నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం దిల్సుఖ్నగర్ను ముంచెత్తింది. స్థానికంగా ఉన్న శివగంగా థియేటర్ కంపౌండ్ వాల్లోకి భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో కంపౌండ్ వాల్ కూలిపోయింది. ఆ గోడ వెంట పార్కింగ్ చేసిన 50 బైక్లు ధ్వంసం అయ్యాయి. సినిమా ఫస్ట్ షో సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫస్ట్ షో సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులకు సెకండ్ షో కనిపించింది. బైక్ల యజమానులు థియేటర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.