హైదరాబాద్ : ఎంజీబీఎస్లో కిడ్నాప్ అయిన బాలుడు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. సోమవారం రాత్రి ఎంజీబీఎస్ బస్టాండ్లో నవీన్(4) అనే బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. నిన్న రాత్రి సీబీఎస్ వద్ద నల్లగొండ బస్సులో నవీన్ ప్రత్యక్షమయ్యాడు. ఈ బస్సు నిన్న మధ్యాహ్నం మిర్యాలగూడ నుంచి హైదరాబాద్కు బస్సు బయల్దేరింది. హైదరాబాద్ చేరుకున్న బస్సులో బాలుడు నిద్ర పోతుండడాన్ని కండక్టర్ గమనించి, పోలీసులకు సమాచారం అందించాడు.
బాలుడిని అఫ్జల్గంజ్ పోలీసులకు అప్పగించారు. అనంతరం నవీన్ను అతని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తే బాలుడిని బస్సు ఎక్కించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి బాలుడిని తీసుకెళ్లిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎంజీబీఎస్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.