హైదరాబాద్ : సికింద్రాబాద్ అల్వాల్ అంజనాపురి కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నాలుగు నెలల పిండాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై పడేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం ఆ పిండాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ పిండాన్ని ఎవరు వదిలేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి ఆచూకీ కనుగొనేందుకు అక్కడున్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.