కేపీహెచ్బీ కాలనీ, ఫి బ్రవరి 6 : ఎల్బీ స్టేడియంలో జరిగిన 3వ నేషనల్ ఓపెన్ కరాటే కుంగ్ ఫూ ఛాంపియన్షిప్ 20 23 సీఎం కేసీఆర్ మెగా కప్లో బాలాజీనగర్కు చెందిన క్రీడాకారులు సత్తాచాటి బంగారు, రజిత పతకాలను సాధించారు. బాలాజీనగర్లోని షాలివన్ మార్షల్ అకాడమీ మాస్టర్ నాగరాజు పర్యవేక్షణలో శిక్షణ పొందిన క్రీడాకారులు సిరిపురం దీక్షిత్రెడ్డి, గుస్కా రాహుల్, కంకనాల అశ్విన్, నందన్, రంగోళి బహుళికలు ఓపెన్ కరాటే కుంగ్ఫూ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని సత్తాచాటి బంగారు పథకాన్ని సాధించారు.
అలాగే రంగోళి సూర్య, కూపాల జశ్వంత్, కూపాల శ్రీపాంత్, గుల్లిపల్లి యశ్వంత్, గోనెపూడి వెంకటకాశి, విద్యశ్రీ లు రజిత పతకాలను సాధించారు. ఛాంపియన్షిప్ పోటీలలో పతకాలు సాధించిన క్రీడాకారులను అకాడమీ నిర్వాహకుడు నాగరాజు అభినందించారు.