మేడ్చల్/శామీర్పేట, మార్చి 29: ‘తెలంగాణ రైతులు అదృష్ట వంతులని, రైతు బిడ్డ అయిన సీఎం కేసీఆర్ అన్ని వసతులు కల్పించి, వ్యవసాయాన్ని పండుగలా చేశారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట వ్యవసాయదారుల సేవా సహకార సంఘం 39వ సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా ఎమ్మెల్సీ సురభివాణిదేవి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు రైతన్న పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. ఉద్యమ నేత సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాడ్డక రైతుల గోస తీరిందన్నారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి వచ్చాయని, 24గంటల కరెంట్ వచ్చిందని అన్నారు. ప్రభుత్వమే ధానాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి, 72 గంటల్లో రైతు ఖాతాలు డబ్బులు జమ చేస్తుందని చెప్పా రు. రైతు సంక్షేమ పథకాల అమలు, చర్యలతో సీఎం కేసీఆర్ దేశంలో నంబర్ వన్గా నిలిచారన్నారు. తెలంగాణకు ఒక మోడల్గా మార్చారన్నారు.
సంఘం పనితీరు అభినందనీయం
సహకార సంఘం పనితీరు అభినందనీయమని జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి అన్నారు. నష్టాల్లో ఉన్న సంఘాన్నిలాభాల బాటలో తీసుకువచ్చి, రైతులకు మేలు చేయడం హర్షణీయమన్నరు. త్వరలో బంగారంపై రుణా లు అందజేయడానికి పూనుకోవడం వల్ల అన్నదాతలకు లాభం చేకూరుతుందని తెలిపారు. రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని, ఆర్థికంగా ఎదగాలని కోరారు. సీఎం కేసీఆర్ను రైతు బాంధవుడిగా రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి అభివర్ణించారు. అందరికి సంఘాలు ఉన్నాయి కానీ రైతులు సంఘాలు లేవని రైతుబంధు సమితి శాఖలను గ్రామ స్థాయి నుంచిరాష్ట్ర స్థాయికి ఏర్పాటు చేశారన్నారు.
అప్పుల్లో ఉన్న సొసైటీ లాభాల బాటలో…
రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డీసీఎంఎస్ వైస్ చైర్మన్, వ్యవసాయదారుల సేవా సహకార సంఘం చైర్మన్ రామిడి మధుకర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు మంత్రి మల్లారెడ్డి నియోకవర్గంలోని రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని తెలిపారు. వ్యవసాయదారుల సేవా సహకార సంఘం శామీర్పేట ఇప్పటి వరకు అప్పుల్లో ఉండేదని సెంట్రల్ బ్యాంక్ నుంచి కేవలం రూ.40 లక్షల లోన్ సదుపాయం ఉండడంతో రైతులకు ఎలాంటి న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని మంత్రికి తెలుపడం జరిగిందన్నారు. స్పందించిన మంత్రి వెంటనే సెంట్రల్ బ్యాంక్ నుంచి ఎన్వోసీ ఇప్పించి డీసీసీపీలో మెర్జ్ చేసి రూ.2 కోట్లు మంజూరు చేయించినట్లు వివరించారు. అదే విధంగా మూడుచింతలపల్లి మండలంలో 4 ఎకరాల కేటాయించినట్లు తెలిపారు. దీంతో లాభాల బాటలో నడుస్తున్న సొసైటీ ఈ ఏడాది రూ.40 లక్షల లాభాలను గడించిందన్నారు.
రైతుల సౌకర్యార్థం క్రాప్లోన్లతో పాటు గోల్డ్ లోన్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. సంఘం సభ్యుడైన రైతు మరణిస్తే అంత్యక్రియలకు రూ.3 వేలు అందజేస్తున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమానికి పాటుపడుతున్న మంత్రి ఇకపై ముందుడి నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, వాణిదేవి, కో ఆపరేటీవ్ బ్యాంక్ అధ్యక్షుడు రవీందర్రావు, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, డీసీసీపీ చైర్మన్ మనోహర్రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్, వ్యవసాయదారుల సేవా సహకార సంఘం చైర్మన్ మధుకర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ భాస్కర్యాదవ్, ఎంపీపీ ఎల్లూభాయిబాబు, జడ్పీటీసీ అనితలాలయ్య, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, రైతుబంధు మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, శ్యామల, డైరెక్టర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డి, మండలాల అధ్యక్షుడు సుదర్శన్, మల్లేశ్గౌడ్, రైతులు పాల్గొన్నారు.