సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా రైల్వే స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు ఆ మేరకు అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకానికి రాష్ట్రంలోని 39 స్టేషన్లు ఎంపికయ్యాయి. తొలి విడతలో భాగంగా వీటిలోని 21 స్టేషన్లను రూ.894 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 6న వీటికి శంకుస్థాపన చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లను అధునికీకరిస్తారు.
స్టేషన్ పరిధిలోని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. వెయిటింగ్ గదులు, మరుగుదొడ్లు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఉచిత వై-ఫై వంటి సౌకర్యాలు కల్పిస్తారు. స్థానిక ఉత్పత్తులకు గుర్తింపు కోసం ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ దుకాణాలను స్టేషన్లలో ఏర్పాటు చేస్తారు. స్టేషన్ పరిసరాల్లో మొక్కలు నాటి పచ్చగా తీర్చిదిద్దుతారు.
రెండోవిడత స్టేషన్లు
తొలి విడత 21 స్టేషన్ల అధునికీకరణ పనులు పూర్తయిన తర్వాత రెండో విడతలో లింగంపల్లి, మంచిర్యాల, మేడ్చల్, మిర్యాలగూడ, నల్లగొండ, పెద్దపల్లి, సికింద్రాబాద్, షాద్నగర్, జోగులాంబ, ఉందానగర్, వికారాబాద్, వరంగల్, యాకుత్పురా, గద్వాల, బాసర, బేగంపేట, అదిలాబాద్, యదాద్రి స్టేషన్లను అభివృద్ధి చేస్తారు.
తొలి విడతలో అభివృద్ధి చేయనున్న 21 స్టేషన్లు ఇవే