సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.2డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.5డిగ్రీలు, గాలిలో తేమ 30శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.