హైదరాబాద్: హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు కొనసాగుతున్నది. గత కొన్నిరోజులుగా సెలవు రోజుల్లో ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దుచేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో నేడు కూడా 34 సర్వీసులను నిలిపివేసింది. ఇందులో లింగంపల్లి-ఫలక్నుమా రూట్లో 9 సర్వీసులు, ఫలక్నుమా-లింగంపల్లి రూట్లో 7, హైదరాబాద్-లింగంపల్లి రూట్లో 9 సర్వీసులు, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య ఒకటి, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్లో ఒక సర్వీసు రద్దయ్యాయి.