హైదరాబాద్ : ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ నగరంలో 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. పలు పనుల కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. లింగంపల్లి – హైదరాబాద్ మధ్యలో 9 సర్వీసులు, హైదరాబాద్ – లింగంపల్లి మధ్య 9 సర్వీసులను రద్దు చేశారు. ఫలక్నూమా – లింగంపల్లి మధ్య ఏడు సర్వీసులు, లింగంపల్లి – ఫలక్నూమా మధ్య ఏడు సర్వీసులను రద్దు చేశారు. సికింద్రాబాద్ – లింగంపల్లి మధ్య నడిచే 47150 రైలు, లింగంపల్లి – సికింద్రాబాద్ మధ్య నడిచే 47192 రైలును కూడా రద్దు చేసినట్లు తెలిపారు.
47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139, 47140
47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120
47153, 47164, 47165, 47166, 47203, 47170, 47220
47176, 47189, 47187, 47210, 47190, 47191, 47192