కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 14: బీఆర్ఎస్తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని, సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. బాలాజీనగర్ డివిజన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోనె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక డివిజన్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు జె.శ్రీకాంత్, సాయికిరణ్, సీహెచ్ శాంతి కుమార్, మురళీ వారి అనుచరులు 300 మంది ఎమ్మెల్యే కృష్ణారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్సీ మోర్చ కమిటీ అధ్యక్షుడు అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ, తొమ్మిదేండ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ప్రగతిని సాధించిందని.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. నగరంలో శాంతిభద్రతల కారణంగా ప్రపంచ స్థాయి సంస్థలు పెట్టుబడులు పెడుతూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. కానీ.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కేవలం మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయంగా లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. బీజేపీ పాలనలో పెట్రోల్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని.. సామాన్యులపై మోయలేని భారం వేశారన్నారు. యువకులు ఆలోచనతో ఓటు వేయాలని బీఆర్ఎస్ను మరోసారి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబురావు, ప్రభాకర్ గౌడ్, గోనె శ్రీనివాస్, వెంకటేశ్, నాగరాజు పాల్గొన్నారు.