తెలుగు యూనివర్సిటీ, మార్చి 10 : ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఉభయ తెలుగు రాష్ర్టాలకు చెందిన 30మంది మహిళలకు ఉమెన్ ఐకాన్-2024అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు.
ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సీహెచ్ బాల్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో శాసనమండలి సభ్యురాలు సురభి వాణీదేవి, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి, సాహితీవేత్తలు డాక్టర్ కె.ప్రతాప్, ఫిలాంత్రోఫిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి రాజా యోనా తదితరులు పాల్గొన్నారు.