హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో శనివారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 255 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 13.63 లక్షల విలువ చేస్తుందని అధికారులు పేర్కొన్నారు.
ట్రాలీ బ్యాగ్ మెటల్ ఫ్రేమ్లో బంగారం దాచి తరలిస్తున్నట్లు తెలిపారు. బంగారానికి వెండి పూత పూశారు. బంగారంతో పట్టుబడ్డ ప్రయాణికుడిని శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రయాణికుడిని విచారిస్తున్నారు.