హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్కు రూ. 25 కోట్ల నిధులను విడుదల చేయడం పట్ల నాయీ బ్రాహ్మణ సేవా సంఘం హర్షం వ్యక్తంచేసింది. గురువారం సీఎం కేసీఆర్కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సెలూన్లకు ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పిస్తూ నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఎంతో అండగా నిలుస్తున్నదని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే నాయీ బ్రాహ్మణులకు భరోసా లభించిందని పేర్కొన్నారు.