Hyderabad | రంగారెడ్డి జిల్లా గండిపేట సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఖానాపూర్లోని ఓ కార్ల గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు ఎగిసిపడటంతో గోదాంలో ఉన్న కార్లన్నీ మంటల్లో తగలబడ్డాయి. గోదాంలో 25 కార్లు ఉండగా.. అవన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి.
భారీ మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు భయాందోళనలయ్రాయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.