సిటీలో మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పనుల కోసం బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
శనివారం నగరంలో గరిష్ఠం 37.5, కనిష్ఠం 23.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చిత్రంలో కేబీఆర్ పార్కు వద్ద ఎండ తీవ్రతకు గురికాకుండా చున్నీ కప్పుకొని వెళ్తున్న యువతులు.