మేడ్చల్, ఫిబ్రవరి 3 : కంటి వెలుగు శిబిరాలకు 11వ రోజూ శుక్రవారం అపూర్వ స్పందన లభించింది. నియోజకవర్గంలోని ఐదు మండలాలు,10 మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో 2,230 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 481 మందికి అద్దాలు ఇచ్చారు. మరో 213 మందిని శస్త్ర చికిత్సలకు రిఫర్చేశారు.