South Central Railway | హైదరాబాద్ : సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ది పనుల నేపథ్యంలో నగరంలో తిరుగవలసిన మొత్తం 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు చేస్తూ శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 26 నుంచి జులై 2 వరకు అంటే దాదాపు ఏడు రోజులు ఈ సర్వీసులు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. లింగంపల్లి-హైదరాబాద్, ఉందానగర్-లింగంపల్లి, ఫలక్నుమా-లింగంపల్లి స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేశామని, రైళ్ల రద్దు వల్ల నగర ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణాను ఎంచుకోవాలని సూచించారు.