మారేడ్పల్లి, నవంబర్ 9 : రైలు ద్వారా ఒడిశా నుంచి సికింద్రాబాద్ మీదుగా ముంబైకి గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం రైల్వే డీఎస్పీ చంద్రభాను, ఇన్స్పెక్టర్ ఎం.శ్రీను వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ర్టానికి చెందిన అభిజిత్ బోయ్ (20) గంజాయిని ముంబైకి సరఫరా చేసేందుకు ఈ నెల 7న బలూగ్గామ్ రైల్వే స్టేషన్లో కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. 8న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే జీఆర్పీ పోలీసులు రైలును తనిఖీ చేస్తుండగా అభిజిత్ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడి బ్యాగ్ను తనిఖీ చేయగా సుమారు రూ.4.40 లక్షల విలువ చేసే 22కిలోల గంజాయి పట్టుబడింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.