సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): నగరంలో మహిళలతో అసభ్యకరంగా(Misbehaving) ప్రవర్తించే వారికి చోటు లేదని, బాధితులు ధైర్యంగా షీ టీమ్స్కు(She teams) ఫిర్యాదు చేయాలని సిటీ మహళా భద్రత డీసీపీ దార కవిత సూచించారు. ఇటీవల గణేష్ నిమజ్జనం(Ganesh festival) సందర్భంగా ఖైరతాబాద్లోని బడా గణేష్, ఇతర రద్దీగా ఉండే గణేష్ మండపాలు, నిమజ్జనం సమయంలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న 996 మందిని షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.
అందులో 200 మందికి మూడు రోజుల పాటు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.1050 జరిమానాను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని ఒక ప్రకటనలో వివరించారు. మిగతా వారికి వారి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. రద్దీ ప్రాంతాలలో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎవరు చూడరనే భావనలో ఉండేవారు తమ మైండ్సెట్ను మార్చుకోవాలని, షీ టీమ్స్ నిఘా నిరంతరం కొనసాగుతుందని డీసీపీ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | అవసరమైతే రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసి.. రుణమాఫీ చేయిస్తా : హరీశ్రావు
KTR | దొడ్డు వడ్లకు కూడా రూ. 500 బోనస్ చెల్లించాలి.. రేవంత్ సర్కార్కు కేటీఆర్ డిమాండ్
Harish Rao | రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. మోసగాడు అని తేలిపోయింది : హరీశ్ రావు