సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా నిర్వహించేందుకు వంద రోజుల కార్యాచరణ అమలుకు జీహెచ్ఎంసీ సన్నద్ధమైంది. ఆస్కి నివేదిక ఆధారంగా జోనల్ కమిషనర్లు, డీసీలు, వైద్యాధికారులు, శానిటేషన్ సూపర్వైజర్లు, సీటీవోలు, రాంకీ ఏజెన్సీ నిర్వాహకులతో జోన్ల వారీగా ప్రత్యేక సమావేశాలు జరిగాయి. సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగానే వంద రోజుల ప్రణాళికను వచ్చే నెల మొదటి వారం నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
పారిశుద్ధ్య నిర్వహణలో తరచూ ఫిర్యాదులు వస్తున్న దరిమిలా ఇటీవల ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) బృందం 2500 జీవీపీ పాయింట్లలో 120 బృందాలుగా ఏర్పడి, జేఎన్ఏఎఫ్ఏయూకు సంబంధించి 18 మంది పీజీ విద్యార్థులతో కలిసి క్షేత్రస్థాయిలో సర్వే జరిపారు. మూడు కేటగిరీలు మార్కెట్, కమర్షియల్, రెసిడెన్షియల్ ఏరియాల్లో ఏం జరుగుతున్నది? చెత్త వేయడానికి గల కారణాలు? లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే అంశాలపై ఆస్కి బృందం క్షుణ్ణంగా సర్వే చేసి పలు సూచనలతో నివేదికను జీహెచ్ఎంసీకి సమర్పించారు.
వంద రోజుల ప్రణాళికలో ప్రధాన అంశాలివే