మహా నగరం గు లాబీ జెండా ద్వి దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజవకర్గమైన శేరి లింగంపల్లి పరిధిలోని (మాదాపూర్) హైటెక్స్ ఇందుకు వేదికైంది. ఇప్పటికే, గులాబీ అలంకరణలతో హైటెక్స్ ప్రాంగణం సహా పరిసర ప్రాంతా లు గులాబీమయమయ్యాయి. ఈ నెల 25న ఇక్కడి హైటెక్స్ ప్రాంగణంలో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి 15 నుంచి 20 వేల వరకు ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో షడ్రసోపేతమైన భోజనాలను అం దించేందుకు సంబంధిత కమిటీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. భోజన వసతి ఏర్పాట్లను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు అప్పగించిన నేపథ్యంలో ఈ బాధ్యతలను ఆయ న హైటెక్స్లో ఉండి పర్యవేక్షణ చేపడుతున్నారు.
ప్రధానంగా ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు మొత్తం 34 రకాల భోజన పదార్థాలను వడ్డించనున్నారు. శాఖాహారంతో పాటు మాంసాహార భోజనాలను రుచికరంగా ఆహూతులకు అందించనున్నట్లు ఎమ్మెల్యే కృష్ణారావు పేర్కొన్నారు. కాగా, ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించేందుకు హైటెక్స్కు విచ్చేసిన మంత్రి కేటీఆర్ భోజన పదార్థాల జాబితాను పరిశీలించి నగరంలో నివసించే అన్ని ప్రాంతాలకు చెందిన వారి భోజన పదార్థాలు ఉండేలా చూడాలన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలు అమితంగా ఇష్టపడే రాగి సంకటిని పదార్థాల జాబితాలో చేర్చాలని ఎమ్మెల్యే కృష్ణారావు కు సూచించారు. దీంతో తాజాగా శనివారం ఆ పదార్థం సైతం జాబితాలోకెక్కింది.
దీనికి తోడు ఇప్పటి వరకు ఏ ప్లీనరీలోనూ ఛాయ్ ప్రస్తావన లేకపోగా, ఈ సారి ప్లీనరీలో మాత్రం తెలంగాణ ఇరానీ ఛాయ్ పార్టీ శ్రేణులకు ప్రత్యేకంగా అందబోతున్నది. 20 వేల మందికి ఈ ప్రత్యేక ఛాయ్ ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మె ల్యే కృష్ణారావు పేర్కొన్నారు. మొత్తం మీద భోజన పదార్థాల జాబితాలో మొత్తం 32 పదార్థాలుండ గా, అందులో మాంసాహారానికి చెందిన 10 ఐటె మ్స్ ఉండగా, మిగిలినవి శాఖాహారానికి చెందిన వి కావటం విశేషం. మూడు ప్రత్యేక మిఠాయి లు ఇందులో వడ్డించబోతున్నారు. హైటెక్స్ ప్రాం గణంలోని అయిదు ప్రత్యేక షెడ్లలో ఒక్కసారికి 8 వేల మంది భోజనం పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసామన్నారు. తద్వారా ప్లీనరీ కేవలం విజయోత్సవాలను పునస్సమీక్షించుకోవటం, ప్రత్యేక భోజనాల ద్వారా పార్టీ శ్రేణులకు ఆతిథ్యమివ్వబోతున్నది.