హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్లో చిన్నారి అదృశ్యమయ్యాడు. శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ ఇంట్లోనుంచి బయటకి వెళ్లిన బాలుడు కనిపించకుండా పోయాడు. రాజేంద్రనగర్లోని జలాల్బాబానగర్కు చెందిన అబ్ధుల్ రహీ, తబుసమ్ దంపతుల రెండేండ్ల కుమారుడు నిన్న సాయంత్రం ఇంట్లో ఆడుకుంటూ బయటకు వచ్చాడు. ఈ క్రమంలో కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎంతకు కనిపించకపోవడంతో పోలీసును ఆశ్రయించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. బాబు ఆచూకీకోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.