అల్వాల్, ఏప్రిల్ 7: వేగంగా దూసుకొచ్చిన కారు చిన్నారిని చిదిమేసింది. ఈ ప్రమాదంలో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం… మహబూబ్నగర్కు చెందిన వెంకటేశ్, శోభ దంపతులు బతుకుదెరువు కోసం అల్వాల్కు వచ్చారు. వారికి ధనూష (2) కుమార్తె ఉంది. అల్వాల్లోని వజ్ర ఎన్క్లేవ్ వద్ద గురువారం రాత్రి రోడ్డుపై ఆడుకుంటున్న ధనూషను ఓ గుర్తుతెలియని కారు వేగంగా దూసుకు వచ్చి ఢీకొట్టింది.
దీంతో తలకు తీవ్ర గాయాలై అకడికకడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు వచ్చి చూసేసరికి అప్పటికే పాప మృతిచెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును గుర్తించేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.