బేగంపేట్ జూన్ 3: ఎంతో మంది నాయకులు ప్రభుత్వాలకు విన్నవించుకున్నా పరిష్కారం కాని తమ 50 ఏండ్ల సమస్య పరిష్కరించారని బేగంపేట్కు చెందిన ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. బేగంపేట్కు చెందిన ముస్లింలలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించేందుకు సరైన స్థలం లేక మృతదేహాలతో రోడ్లపైకి వచ్చి అనేక ఆందోళనలు చేసేవారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కృషితో బేగంపేట్లోని ఓల్డ్ కస్టమ్స్ బస్తీ ప్రాంతంలో 2 ఎకరాల భూమిని ముస్లిం శ్మశానవాటిక కోసం కేటాయించారు.
ఈ స్థలాన్ని సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. మంగళవారం బేగంపేట్కు చెందిన బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి ఆధ్వర్యంలో ముస్లింలు పెద్ద సంఖ్యలో వెస్ట్ మారేడ్పల్లిలోని మంత్రి తలసాని నివాసం వద్దకు చేరుకొని హర్షం వ్యక్తం చేశారు. మంత్రిని సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బేగంపేట్ డివిజన్ మైనార్టీ నాయకులు సలీంఖాన్, సాబేర్, సమి, మోహన్, వాహీద్, ఆరీఫ్, ఫిరోజ్,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డీవీ నరేందర్రావు, శ్రీనివాస్గౌడ్, శేఖర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.