జైపూర్: రాజస్థాన్లో 19 కొత్త జిల్లాలు, మూడు కొత్త డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను ఆ రాష్ట్ర క్యాబినేట్ ఆమోదించింది. కొత్త జిల్లాల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపింది. కొత్త జిల్లాలతో కలుపుకొని మొత్తం జిల్లాల సంఖ్య 50కి చేరుతుందని వెల్లడించింది. సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ సుదూర ప్రాంతంలో ఉంటున్న ప్రజలు జిల్లా కేంద్రానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు.