బంజారాహిల్స్, జూన్ 2: ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో కొకైన్ విక్రయిస్తున్న నైజీరియన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియాకు చెందిన ఒకోరే కోస్మోస్ రామ్సే అలియాస్ ఆండీ (38) షేక్పేట సమీపంలోని వినాయక్నగర్లో ఉంటూ డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం షేక్పేట గణేశ్ మందిరం సమీపంలో ఆండీని ఫిలింనగర్ పోలీసులు తనిఖీ చేయగా.. అతడి వద్ద 16 గ్రాముల కొకైన్ దొరికింది. కర్ణాటకలో ఉంటున్న నైజీరియన్ ఒబాసిన్ నుంచి 30 గ్రాముల కొకైన్ కొనుగోలు చేశానని, 14గ్రాములు గతంలోనే విక్రయించినట్టు ఆండీ వెల్లడించాడు. గతంలో గ్రాము రూ.5వేలకు కొనుగోలు చేసి, నగరంలో గ్రామును రూ.10వేల చొప్పున విక్రయించినట్టు చెప్పాడు. తన వద్ద కొనుగోలు చేసే ఆదర్శ్, సుమిత్, ఇషాన్, ఎన్కే కోసం తాజాగా కొకైన్తో సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.