ఘట్కేసర్,అక్టోబర్30: బీఆర్ఎస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో దాదాపు 150 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. అనంతరం బైక్ర్యాలీతో పాటు రాజీవ్ గృహకల్పలో నిర్వహిం చిన రోడ్షోలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసే ఇతర పార్టీల నాయకులు,కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. పారిశ్రామికంగా, ఆర్థ్ధికంగా, రవాణాపరంగా ఎంతో అభివృద్ధి సాధించామన్నారు.
దేశంలోని బీజేపీ,కాంగ్రెస్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసే ప్రజలు మరోసారి బీఆర్ఎస్కు ఓటు వేసి సీఎం కేసీఆర్ను మరోసారి సీఎంను చేయాలని నిర్ణయించుకున్నారని మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమం చైర్మన్ బి.కొండల్రెడ్డి ఆధ్వర్యంలో జరుగగా, బీఆర్ఎస్ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ జి.బాలేశ్, ప్రధాన కార్యదర్శి శేఖర్ ముదిరాజ్, కౌన్సిలర్లు బి.హరిప్రసాద్రావు,బి.వె ంకటేశ్ గౌడ్,సి. సాయిరెడ్డి,యువజన సంఘాలు,యత్ నాయకులు,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఘట్కేసర్లో గడపగడపకు బీఆర్ఎస్ అన్న నినాదంతో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం నిర్వహిస్తున్నారు. చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మ్యానిఫెస్టో పత్రాలతో ప్రతి ఇంటికి వెళ్లి అందజేస్తున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జంగ య్య యాదవ్,మైనార్టీ అధ్యక్షుడు కుతుబ్,శశిబేగం, హాబీబ్, సలీం,మురళీ గౌడ్,అస్లాం ,జాంగీర్, విజయ్, జావిద్, సందీప్ పాల్గొన్నారు.