అమీర్పేట్, అక్టోబర్ 22: అభివృద్ధి అంటే ఇది.. అనేలా చేసి చూపించిన బీఆర్ఎస్ సనత్నగర్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెంటే మేమంతా నడుస్తామని సనత్నగర్ అశోక్కాలనీ, డీఎన్ఎం కాలనీ, ఎస్ఆర్టీ కాలనీ నివాసితులు ముక్తకంఠంగా మంత్రి తలసానికి మద్దతు తెలిపారు. ఆదివారం ఉదయం సనత్నగర్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో డివిజన్ ఎంఐఎం అధ్యక్షుడు మహ్మద్ షౌకత్ నేతృత్వంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి వెంట ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారిడి. పార్థసారధి నేతృత్వంలో సనత్నగర్, అమీర్పేట్ డివిజన్లకు చెందిన వయోధిక సంస్థల ప్రతినిధులు పెద్దసంఖ్యలో మంత్రి తలసాని మద్దతు తెలుపుతూ ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. మైనార్టీ ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతాలు గడిచిన దశాబ్ద కాలం వరకు అభివృద్ధికి దూరంగా ఉండేవని, అయితే మంత్రి తలసాని ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాతే ఇక్కడి ప్రజలకు అభివృద్ధిని పరిచయం చేశారని గుర్తు చేసుకుంటూ ముస్లిం మహిళలు మంత్రి తలసాని విజయం సాధించాలని కోరుకుంటూ… దట్టీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
వివిధ కాలనీలకు చెందిన దాదాపు 150 మంది ఆదివారం మంత్రి తలసాని సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్యే ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి రూ. 1400 కోట్ల నిధులను వెచ్చించినట్లు చెప్పారు. అశోక్కాలనీ, డీఎన్ఎం కాలనీలో డ్రైనేజీ, మంచినీటి సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశామని, రాబోయే రోజుల్లో ఈ కాలనీలు మరింతగా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షులు కొలను బాల్రెడ్డి, నాయకులు సయ్యద్ నుమానుద్దీన్, సురేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.