సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : చారిత్రక మూసీ, ఈసీ నదులపై ఏకకాలంలో 15 చోట్ల కొత్త వంతెనల నిర్మాణానికి కీలక అడుగు పడింది. పర్యాటకానికి మరింత వన్నె తీసుకువచ్చే విధంగా రూపొందించిన డిజైన్ను ఖరారు చేశారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వ అనుమతితో హెచ్ఆర్డీసీఎల్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కుడా శాఖలు ఈ బ్రిడ్జిల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించి పనులు చేపట్టనున్నాయి. ఆయా ప్రాంతాల్లో సాఫీ ప్రయాణంతో పాటు పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.545 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
జీహెచ్ఎంసీ రూ.168కోట్లు