హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిపై కొవిడ్ పంజా విసిరింది. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో 15 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇందులో 12 మంది వైద్యులు కాగా, మరో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. వీరందరూ హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇటీవల హాస్పిటల్కు వచ్చిన వారంతా టెస్టులు చేయించుకొని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కొత్తగా మూడువేల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మంగళవారం 1,07,904 మందికి పరీక్షలు చేయగా.. 2,983 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ సమస్యలతో ఇద్దరు మరణించారు. 2,706 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 22,472 మంది ఐసొలేషన్లో చికిత్స పొందుతున్నా రు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,206, మే డ్చల్ మల్కాజిగిరిలో 259, రంగారెడ్డిలో 227, సం గారెడ్డిలో 96 కేసులు వెలుగుచూశాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 22 వేలు దాటింది. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన బీఆర్కేభవన్లో పలు విభాగాల్లో అధికారులు, సిబ్బంది పదుల సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యాలయంలో పలువురు ఉద్యోగులకు కూడా కరోనా సోకింది.