హైదరాబాద్ : నగరంలోని టప్పాచబుత్ర పోలీసు స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో 15 తులాల బంగారం, 10 తులాల వెండితో పాటు రూ. 50 వేల నగదును దొంగలు అపహరించారు. ఆ ఇంటి యజమాని బుధవారం ఉదయం వచ్చి చూడగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి.
దీంతో బాధిత వ్యక్తి టప్పాచబుత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ఇంటిని పరిశీలించారు. ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.