బొల్లారం, డిసెంబర్ 4: తిరుమలగిరి కోహిమాం దర్గా సమీపంలోని నీటి గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. తిరుమలగిరి సీఐ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బోయిన్పల్లికి చెందిన ఇస్మాయిల్ (14) ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.
గత నెల 28న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు. తండ్రి తౌఫిక్ ఫిర్యాదు మేరకు బోయిన్పల్లి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈనెల 2న తిరుమలగిరి పరిధిలోని కోహిమాం దర్గా గుంతలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వివరాలు ఆరా తీయగా.. బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్గా ఆదివారం పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.