హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లోని పాతబస్తీలో 13 ఏండ్ల బాలుడి అదృశ్యం కలకలం రేపుతున్నది. ఈనెల 14న పాతబస్తీలోని ఫతే దర్వాజాకు చెందిన మొహమ్మద్ నసీర్ అదృశ్యమయ్యాడు. బుధవారం సాయంత్రం కూరగాయల కోసం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన బాలుడు రాత్రి వరకు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్క ప్రాంతాల్లో వెతికినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు ఎక్కడికి వెళ్లాడని తెలుసుకోవడానికి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.