సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నికల(Loksabha Elections) నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా(Greater Hyderabad) విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్((Election Code) )వచ్చినప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఇప్పటి వరకు రూ. 14.3 కోట్ల నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ తెలిపారు.
కోటి 95 లక్షల 40 వేల 927 రూపాయల విలువ గల ఇతర వస్తువులు, 20,198.28 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. 177 కేసులు నమోదు చేసి 169 మందిని అరెస్ట్ చేశామని, నగదు ఇతర వస్తువులపై 364 ఫిర్యాదులు రాగా పరిశీలించి పరిష్కరించామని చెప్పారు. 237 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, 2787 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేశారని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రోస్ తెలిపారు. గడిచిన 24 గంటల వ్యవధిలో రూ 28 లక్షల నగదు,రూ.2.37లక్షల విలువైన వస్తువులను పట్టుకొని సీజ్ చేసినట్లు చెప్పారు.