బడంగ్పేట, ఏప్రిల్ 14 : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 125 అడుగుల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించడం జరిగిందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఏప్రిల్ మాసం వచ్చిందంటే మహనీయుల పండుగలు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, బడంగ్పేట మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ఇబ్రాంశేఖర్, మీర్పేట డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.