మేడ్చల్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : నిరుపేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో మంగళవారం మంత్రి మల్లారెడ్డి 1200మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకం కింద మంజూరైన ప్రొసిడింగ్ (ఉత్తర్వులు) పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గృహలక్ష్మి పథకం ద్వారా ఇళ్లు లేని నిరుపేదలు ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అర్హూలైన వారందరికీ వర్తింపజేస్తామని, ఇది నిరంతర పక్రియ అని అన్నారు.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రూ.3 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మరని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లను గల్లంతు చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ ఈఈ శ్రీనివాసమూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ ప్రణీత, మార్కెటి కమిటీ చైర్మన్ భాస్కర్యాదవ్, పోచారం మున్సిల్ చైర్మన్ కొండల్రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డ్యా నాయక్, తదితరులు పాల్గొన్నారు.