కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 20 : క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న 12 మంది నిందితులను మేడ్చల్, బాలానగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. గురువారం మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో కేసు పూర్వాపరాలను డీసీపీ సందీప్ గోనె వెల్లడించారు. భీమవరానికి చెందిన ఎస్కే జిలానీ, కాకినాడకు చెందిన పాండు, ఈస్ట్గోదావరికి చెందిన అయ్యప్ప అలియాస్ మణికంఠ, కుమార్ ప్రధాన బుకీలుగా వ్యవహరిస్తూ నగరంలోని సబ్ బుకీలైన నిజామాబాద్ జిల్లా డంగ్ర మండలంలోని మాధవనగర్కు చెందిన ముత్తిని వసంత్కుమార్(42), వెస్ట్గోదావరి భీమవరానికి చెందిన వెంకట రామరాజు(41), చింతల వెంకట పద్మ చంద్రమోహన్(43), కాకినాడకు చిట్టిబొమ్మ కార్తిక్(32), బాదం వీరయ్య(37), బండారి శివకుమార్(37), అల్వాల్ ప్రాంతానికి చెందిన మిద్దెల మనోజ్కుమార్(40), రాజమండ్రికి చెందిన చంద్రపాటి సతీశ్కుమార్(30), ఈస్ట్గోదావరికి చెందిన పాతపాటి రవివర్మ(30) సహకారంతో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్పరిధిలో దాడులు జరిపి 12మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.50 లక్షల నగదు, 27 సెల్ఫోన్లు, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా రూ.3. 29 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ను సీజ్ చేశారు. ఈ సమావేశంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, మేడ్చల్ ఎస్వోటీ సీఐ జేమ్స్బాబు, పేట్ బషీరాబాద్ సీఐ ప్రశాంత్, ఎస్వోటీ ఎస్ఐలు విజయ్, చంద్రశేఖర్తో పాటు పేట్ బషీరాబాద్ ఎస్ఐలు రామకృష్ణ, మల్లేశ్వర్, రాంనారాయణ తదితరులు పాల్గొన్నారు.