దుండిగల్,సెప్టెంబర్ 3: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి 1వ డివిజన్లో ఆదివారం ఎమ్మెల్యే 104వ రోజు ప్రగతియాత్రలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు కాలనీల్లో రూ.5.24 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ విజయలక్ష్మి, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కొలన్ గోపాల్రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఇందులో భాగంగా క్రాంతినగర్ కాలనీలో రూ.47.50 లక్షలతో సీసీ రోడ్డు, రూ.20 లక్షలతో పార్కు అభివృద్ధి, చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్స్, రూ.80 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులు, కేఆర్సీఆర్ కాలనీలో రూ.24లక్షలతో సెంట్రల్ లైటింగ్, బొంగులకుంట పార్కులో రూ.71 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే ప్రణీత్ ప్రణవ్ అంటీలియా నుంచి మొండి చెరువు వరకు రూ.75లక్షలతో చేపట్టిన వరదనీటి కాలువ నిర్మాణ పనులు, రూ.కోటీ వ్యయంతో దయ్యాలకుంట అభివృద్ధి పనులు, రేయిన్బో కాలనీలో రూ.12 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, బ్లాక్ డైమండ్ లే అవుట్లో రూ.50లక్షల వ్యయంతో చేపట్టిన భూగర్భడ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయంలో నిధులకు ఎటువంటి కొరత లేదని, దీంతో నిజాంపేట్ కార్పొరేషన్ను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో నిజాంపేట్ను ఆదర్శవంతమైన మున్సిపల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని ట్రాపిక్ సమస్యలు తలెత్తకుండా ఫ్లైఓవర్ వంటి నిర్మాణాలు చేపడుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ రామకృష్ణారావు, కార్పొరేటర్లు వెంకటేశం,ఆగంరాజు ముదిరాజు, కొలన్ వీరేందర్రెడ్డి, బాలాజీనాయక్, సుజాత, సురేశ్రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్సలీం, బీఆర్ఎస్ నాయకులు జగన్, సునీల్రెడ్డి, సతీశ్, దశరథ్, సుబ్బారావుతో పాటు ఆయా కాలనీలకు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.