హైదరాబాద్, జనవరి 11 : విద్యార్థి దశలోనే పఠనాభిలాషను ప్రోత్సహించేందుకు పాఠశాలల్లో 100 రోజుల రీడింగ్ క్యాంపెయిన్ను నిర్వహించనున్నారు. బాలవాటిక (శిశు) నుంచి 8వ తరగతి వరకు గల విద్యార్థులందరికీ 100 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు నోడల్ అధికారిగా ఎస్సీఈఆర్టీలో తెలుగు పాఠ్యపుస్తకాల కోఆర్డినేటర్గా పనిచేస్తున్న సువర్ణ వినాయక్ను నియమించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన మంగళవారం ఆదేశాలు జారీచేశారు. సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పిల్లల కోసం గ్రంథాలయాల్లో పుస్తకాలను సిద్ధంచేయడంతోపాటు వాటిని పిల్లలతో ప్రతిరోజు చదివిస్తారు.