పీర్జాదిగూడ/ఘట్కేసర్,డిసెంబర్6: దివ్యాంగుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని ఆదరించాలని పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ వెంకట్రెడ్డి, ఘట్కేసర్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీలోని చైల్డ్ గైడెన్స్ సెంటర్లోని దివ్యాంగులు తయారు చేసిన వస్తుప్రదర్శననుచైర్పర్సన్ మంగళవారం ప్రారంభించి సందర్శించారు. అనంతరం దివ్యాంగులకు బిస్కెట్లు,పండ్లను ఆమెఅందజేశారు.
అదేవిధంగా ప్రపంచ వికలాంగు దినోత్సవాన్ని పురస్కరించుకుని పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని చైల్డ్ గైడెన్స్ సెంటర్లో నిర్వహిస్తున్న దివ్యాంగుల వారోత్సవాలకు మేయర్ వెంకట్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలు చేసిన పలు వస్తువుల స్టాల్స్ను పరిశీలించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రమ్య సతీశ్గౌడ్, చైల్డ్ గైడెన్స్ సెంటర్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఘనాపూర్ ఇన్చార్జి సర్పంచ్ గోపాల్రెడ్డి, నాయకులు ముల్లి జంగయ్య యాదవ్, వేముల మహేశ్గౌడ్,మాధవ రెడ్డి, రహీం విద్యార్థులు పాల్గొన్నారు.