జూబ్లీహిల్స్,ఆగస్టు 8: దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. దళితులతో పాటు పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిరాటంకంగా అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు.
సోమవారం రహ్మత్నగర్ డివిజన్లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి దళితబంధు లబ్ధిదారుడు పెద్దింటి కుమార్కు మంజూరైన కారును, తాళాలను ఇంటివద్దే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల ఆర్థిక అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. దళితబంధు పథకం దళితుల జీవితాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందని సూచించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారుడు పెద్దింటి కుమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ దళితబంధు పథకంతో జీవనోపాధిని కల్పించిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాగరాజు, షరీఫ్, రవిశంకర్, జబ్బార్, నజీర్, శాంతకుమార్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.