సైదాబాద్, నవంబర్ 10 : గంజాయి మత్తులో ఆటోడ్రైవర్పై అతడి స్నేహితులే కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన సంతోష్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రియాసత్నగర్కు చెందిన ఇమ్రాన్ ఆటో డ్రైవర్.
బుధవారం రాత్రి ఇమ్రాన్ తన ఆటోలో ఇంటికి వెళ్తుండగా, అతడి స్నేహితులు వసీమ్, అహ్మద్, ఇర్ఫాన్, సల్మాన్ ఆపి.. గంజాయి మత్తులో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వారి మధ్య డబ్బుల విషయంలో వాగ్వాదం చోటు చేసుకొని.. ఘర్షణకు దారితీసింది. దీంతో వారందరూ కలిసి ఇమ్రాన్పై కత్తులతో దాడిచేశారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి గాయపడ్డ అతడిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ స్వామి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.