బంజారాహిల్స్, నవంబర్ 1: మెదడు, మూత్రపిండాలతో సహా ముఖ్యమైన అవయవాలకు రక్తాన్ని సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న ధమని లోపలి భాగంలో ఏర్పడిన లోపాన్ని సరిదిద్దేందుకు బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన సర్జరీ చేశారు. మంగళవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేర్ ఆస్పత్రి కార్డియాలజీ విభాగాధిపతి డా.జి.రామసుబ్రహ్మణ్యం వివరాలు వెల్లడించారు.
మేడ్చల్కు చెందిన విజయ్కుమార్(43) స్టాన్ఫోర్డ్ టైప్-ఏ ఆరోటిక్ డిసెక్షన్ అనే సమస్యతో బాధపడుతూ ఇటీవల కేర్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు ఈ సమస్యను సకాలంలో గుర్తించడంతో పాటు 20 గంటలపాటు బెంటాల్స్ ప్రొసీజర్ ద్వారా అత్యాధునిక స్టెంట్ గ్రాప్ట్స్ను వినియోగించి సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. 12 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో కోలుకున్న అనంతరం మంగళవారం విజయ్కుమార్ను డిశ్చార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో కేర్ ఆస్పత్రి క్లినికల్ డైరెక్టర్ డా.పీసీ.గుప్తా, డా.సునీల్, బి.పుల్లా పాల్గొన్నారు.