సికింద్రాబాద్, ఆగస్టు 14 : భిన్నత్వంలో ఏకత్వమే మన దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలబడేలా చేస్తోందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అ న్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కు రెండో రోజు ఆదివారం మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఉత్తేజపరిచిన లెఫ్టినెంట్ జనరల్…
పరేడ్ గ్రౌండ్లో రెండు రోజుల పాటు సాగిన ఆర్మీ ప్రదర్శనల ముగింపు సందర్భంగా దక్షిణ్ భారత్ జీవోసీ, లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ కుమార్ ప్రసంగం ఆహుతులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగు వ్యక్తి అయిన ఆర్మీ ఉన్నతాధికారి తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడుతూ ఉత్తేజపరిచారు.
అమర జవానులకు నివాళి
తెలంగాణ ఆంధ్రా సబ్ ఏరియా ప్రాంతానికి చెందిన అమర జవానుల కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి, మేజర్ పద్మపాణి ఆచార్య సతీమణి చారులత ఆచార్య, కంటోన్మెంట్కు చెందిన లాన్స్నాయక్ రాంచందర్ సతీమణి ఎంఆర్ దివ్యతో పాటు అమర వీరుల కుటుంబ సభ్యులు విమలారావు, లక్ష్మీదేవి, నస్రీన్ ఖాన్, గీత మాధవ్, సుభాషిణీ, నీలం దేష్కర్, సర్వాహ్జా, శివలీల, కిరణ్ గుప్తా, సుహాసినీ మహేశ్వర్, నసీమ్ సుల్తానా తదితరులకు మంత్రి జ్ఞాపికలను అందజేశారు. మిలటరీ ఆపరేషన్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సేవా పురస్కారాల గ్రహీతలు అయిన మిలటరీ అధికారులు టీఎన్ సాయి కుమార్, కల్నల్ సురేంద్ర పోలా, కల్నల్ రాహుల్ సింగ్ తదితరులకు మంత్రి కేటీఆర్ ప్రశంసా పురస్కారాలు అందజేశారు.
కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్రా సబ్ ఏరియా జీవోసీ మేజర్ జనరల్ రంజిత్ సింగ్, డిప్యూటీ జీవోసీ, కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ లాస్యనందితా, బోర్డు మాజీ సభ్యులు నళిని కిరణ్, లోకనాథం, నేతలు నివేదితా, టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, పిట్ల నగేశ్, మురళీయాదవ్, సదానంద్ గౌడ్, నర్సింహ యాదవ్, నర్సింహ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.