హైదరాబాద్ జనవరి 25 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే తెలంగాణ ముందు స్థానంలో నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టస్ లో తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ పథకం అడిషనల్ ప్రాజెక్టు అధికారుల అసోసియేషన్ 2022 సంవత్సరం క్యాలెండర్, డైరీలను మంత్రి మంగళవారం ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్రానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 13 కోట్ల 75 లక్షల పని దినాలు కేటాయిస్తే ఇప్పటివరకు 13 కోట్ల 38 లక్షల పని దినాలు (97.31 శాతం) కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు. మరో రెండు కోట్ల పని దినాలను అనుమతి లభించిందని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీఓల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం మోహన్ రావు, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి అసోసియేషన్ బాధ్యులు గురుపాదం, శ్రీనివాసరెడ్డి, బాలయ్య, నారాయణ, జాకబ్, శ్రీనివాస్ ఇతర నాయకులు పాల్గొన్నారు.