మేడ్చల్, ఫిబ్రవరి 24: డ్వాక్రా సంఘం సభ్యుల ఆర్థిక పురోగాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీలు, జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని మహిళా సంఘాల ఆర్పీలతో మంత్రి గురువారం బోయిన్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆర్పీలతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. మంత్రి సతీమణి కల్పనారెడ్డి చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంఘాల ఏర్పా టుతో మహిళలు ఐక్యంగా ఉండటంతో పాటు ఆర్థిక పురోగతి, రాజకీయ, సామాజిక అభివృద్ధి సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జవహర్నగర్ కార్పొరేటర్ మురుగేశ్, కో ఆప్షన్ సభ్యురాలు శోభారెడ్డి తదితరులు పాల్గొన్నారు.