కొవిడ్-19 లాక్డౌన్ తర్వాత యూరప్లోని సూపర్మార్కెట్లలో టాయిలెట్ పేపర్ల కొరత ఏర్పడింది. ఇది నిజంగా ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. కిరాణా వస్తువులు, ఆహార పదార్థాలు, వైద్య సామాగ్రి కొరత అనేది కామన్. కానీ, టాయిలెట్ పేపర్ల కొరత అనేదే కాస్త ఆలోచించాల్సిన విషయం. వెస్ట్రర్న్ కంట్రీస్లో మలవిసర్జన తర్వాత టాయిలెట్ పేపర్తోనే తుడుచుకుంటారు. వాళ్లకు కడుక్కునే అలవాటు తక్కువ. అయితే, ఒక్కసారిగా టాయిలెట్ పేపర్ కొరత ఏర్పడడంతో ఉక్కిరిబిక్కిరైపోయారు.
ఈ నేపథ్యంలోనే మలవిసర్జన తర్వాత టాయిలెట్ పేపర్తో తుడుచుకోవడం బెటరా? కడుక్కోవడం బెటరా? అనే దిశగా నిపుణులు దృష్టిసారించారు. పలు పరిశోధనలు చేసి, మలవిసర్జన తర్వాత నీటితో కడుక్కుంటేనే బెటర్ అని తేల్చారు. ఇలా చేయడం వల్ల దద్దుర్లు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తక్కువని తేల్చారు. టాయిలెట్ పేపర్తో తుడుచుకోవడం కన్నా నీటితో కడుక్కుంటేనే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావని యూఎస్కు చెందిన యూరాలజీ గ్రూప్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఫిలిప్ బఫింగ్టన్ పేర్కొన్నారు. మలవిసర్జన తర్వాత నీటితో కడుక్కుంటే దద్దుర్లు, అసౌకర్యం, చికాకునుంచి బయటపడొచ్చని కాలిఫోర్నియాకు చెందిన కొలొరెక్టల్, జనరల్ సర్జన్ డాక్టర్ అలెన్ కమ్రావా వెల్లడించారు.
టాయిలెట్ పేపర్తో సున్నితంగా తుడుచుకోవడం సాధ్యపడదని, ఫలితంగా సున్నితమైన చర్మానికి తీవ్ర నష్టం కలుగుతుందని నిపుణులు పేర్కొన్నారు. వీటివల్ల మహిళల్లో యూటీఐ ఇన్ఫెక్షన్లు కలుగుతాయన్నారు. టాయిలెట్ పేపర్తో సరిగ్గా తుడుచుకోకపోవడం వల్ల మల అవశేషాలు అలాగే ఉండి అంటువ్యాధులకు కారణమవుతుందని తెలిపారు. అలాగే, కాగితాల్లో బ్లీచ్ ఉంటుందని, ఇది చర్మానికి అత్యంత హానికరమని పేర్కొన్నారు. పర్యావరణం పరంగా చూసినా పేపర్కంటే నీటి అవసరం తక్కువని తేల్చారు. సైంటిఫిక్ అమెరికన్లోని ఒక కథనం ప్రకారం.. కేవలం ఒక టాయిలెట్ పేపర్ను తయారు చేసేందుకు 140 లీటర్ల నీరు అవసరపడితే.. మలవిసర్జన తర్వాత శుభ్రం చేసుకోవడానికి కేవలం 500 మి.లీ. నీరు మాత్రమే అవసరపడుతుంది. అందుకే ఏ విధంగా చూసినా మలవిసర్జన తర్వాత టాయిలెట్ పేపర్తో తుడుచుకోవడం కంటే నీటితో కడుక్కోవడమే ఉత్తమమని నిపుణులు తేల్చారు.