రెండో దశ కరోనాలో ఎంతోమంది బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే పుట్టిన బిడ్డలు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘తల్లిపాల బ్యాంకు’లు కొంతవరకు ఆదుకున్నా పరిస్థితి ఇబ్బందికరంగానే తయారైంది. దీంతో, కృత్రిమంగా తల్లిపాలు సృష్టించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ‘బయోమిల్క్’ అనే సంస్థ రానున్న రోజుల్లో చనుబాలను పోలిన పాలను మార్కెట్లోకి తీసుకురానుంది. అమ్మపాలలో ఉన్నట్టే ఇందులోనూ వందలకొద్దీ ప్రొటీన్లు, సంక్లిష్ట కార్బొ హైడ్రేట్లు, ఫ్యాటీ యాసిడ్స్, ఇతర లిపిడ్స్ ఉంటాయంటున్నారు తయారీదారులు.