డాక్టర్గారూ నాదొక సందేహం. కొన్నిసార్లు వ్యాక్సిన్లు వేయించినా కూడా.. ఆయా వ్యాధులను అడ్డుకోలేమంటారు. నిజమేనా?
మీ అభిప్రాయంలో కొంత నిజం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలన్నీ అత్యున్నత ప్రమాణాలతో తయారైనవే. అనేక కఠిన పరీక్షల తర్వాతే మార్కెట్లోకి వస్తున్నాయి. అయినా, ఒకటి రెండు కేసుల్లో తేడాలు ఉండవచ్చు. ఒకరిద్దరి విషయంలో పనిచేయకపోవడానికి ఆస్కారం ఉంది. దీన్నే వైద్య పరిభాషలో ‘ఇమ్యునో
డెఫీషియెన్సీ’ అంటారు. రోగ నిరోధక వ్యవస్థ అంతరించిపోయిన ఎయిడ్స్ రోగులు, క్యాన్సర్ బాధితులు.. తదితరుల విషయంలో టీకాలు సమర్థంగా పనిచేయవు. అంతేకాదు, మనం తీసుకున్న వ్యాక్సిన్ శరీరమంతా వ్యాపించి.. రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేయడానికి కొంత సమయం పడుతుంది. ఆలోపు వ్యాధి వస్తే మనమేం చేయలేం.
మరొక్కమాట. పిల్లలకు టీకాలు ఇప్పించడం ఎంత ముఖ్యమో.. దానికి సంబంధించిన రికార్డులు సురక్షితంగా దాచుకోవడమూ అంతే ముఖ్యం. స్కూల్ అడ్మిషన్లు, విదేశీ ప్రయాణాలు మొదలైన సందర్భాల్లో వాటిని దాఖలు చేయాల్సి రావచ్చు. రికార్డుల వల్ల ఎప్పుడు ఎన్నో డోస్ ఇవ్వాలనే స్పష్టత వస్తుంది. డోసేజీ విషయంలో అనుమానం ఉన్నప్పుడు.. అదే డోసు మరోసారి ఇప్పించినా ఇబ్బంది లేదు. దీనివల్ల నష్టమూ లేదు.
డాక్టర్ కర్రా రమేశ్రెడ్డి పిల్లల వైద్య నిపుణులు సికింద్రాబాద్.