న్యూఢిల్లీ : ఆధునిక జీవితంలో కాలంతో సగటు జీవి పరుగులు పెట్టే యంత్రంగా మారడంతో ఒత్తిడి (stress) చుట్టుముడుతోంది. ఒత్తిడి లేని ప్రశాంత జీవితం అరుదైపోవడంతో పలు జీవన శైలి వ్యాధులు తలెత్తుతున్నాయి. ఒత్తిడి తీవ్రమైతే మన శరీరం దానికి స్పందించే తీరుతో పలు ప్రతికూల ప్రభావాలు వెంటాడతాయి. ఒత్తిడి తీవ్రతరమైతే హార్మోన్లు విడుదలవడంతో హార్ట్ రేట్, బీపీ పెరగడం గమనించవచ్చు.
స్ట్రెస్ హార్మోన్లు అధికంగా విడుదలైతే జీర్ణక్రియ, పునరుత్పత్తి, శరీర పెరుగుదలలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇక ఒత్తిడిని శారీరక వ్యాయామంతో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు యోగ, ధ్యానం వంటి వాటితో చిత్తు చేయవచ్చు. కొన్ని రకాల ఆహార పదార్ధాలను తీసుకోవడం కొన్ని ఆహార పదార్ధాలను దూరం పెట్టడం ద్వారా మానసికంగా, శారీరంకంగా ఒత్తిడికి దూరం కావడంతో పాటు రోజంతా ఉత్తేజంగా గడపవచ్చు.
ప్రాసెస్డ్ ఫుడ్, రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్ భోజనానికి బదులుగా పండ్లు, కూరగాలు, మొక్కల ఆధారిత ప్రొటీన్స్, నట్స్, సీడ్స్ వంటి సహజసిద్ధమైన ఆహారం తీసుకోవాలి. ఒత్తిడిని అధిగమించే యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఈ ఆహారంలో ఉండటంతో స్ట్రెస్ దరిచేరదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు గుడ్లు, చికెన్, లీన్ మీట్ వంటి బీ విటమిన్ అధికంగా ఉండే ఆహారంతో కార్టిసాల్ లెవెల్స్ను నియంత్రించవచ్చు. చియా సీడ్స్, అవిసె గింజలు, ఆలివ్ ఆయిల్, ఫ్యాటీ ఫిష్ వంటి ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారంతో ఇన్ఫ్లమేషన్ను తగ్గించుకోవచ్చు.
Read More :
Shraddha Kapoor | రూ.4కోట్ల ఖరీదైన కారు కొన్న సాహో నటి.. నెట్టింట ఫొటోలు వైరల్